స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు Taapsee Pannu ని కొట్టిన అమ్మాయి.. సంతోషంగా ఉందంటూ..
ABN , First Publish Date - 2022-07-11T18:45:42+05:30 IST
టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన నటి తాప్సీ పన్ను...
టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన నటి తాప్సీ పన్ను (Taapsee Pannu). అనంతరం ఈ బ్యూటీ వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే.. దక్షిణాదిలోని ఇతర భాషల చిత్రాల్లో నటిస్తూ.. సౌతిండియాలోనే నటిగా మంచి పాపులారిటీ సాధించింది. అనంతరం ‘ఛష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి.. అక్కడ ఎక్కువగా మహిళా పాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నటి తాజాగా ప్రముఖ భారతీయ మహిళ క్రికెటర్, మాజీ ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) బయెపిక్ ‘శభాష్ మిథు (Shabaash Mithu)’లో నటిస్తోంది. త్వరలో విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మిథాలీరాజ్తో కలిసి తాప్సీ పాల్గొంది. అందులో.. ఈ ఇద్దరు స్టార్స్ గతంలో తమకి ఎదురైన కొన్ని ఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో ‘మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టారా?’ అని యాంకర్ అడగగా.. తాప్సీ పన్ను మాట్లాడుతూ.. ‘నా సహ నటుడు లేదా నటి నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కానీ.. నేను ఒకసారి నా స్నేహితులతో కలిసి గోవా టూర్కి వెళ్లాను. అక్కడ పరిసరాలను చూసేందుకు బయటకి వెళ్లాను. ఆ సమయంలో ఓ అమ్మాయి నన్ను కొట్టింది. నేను మొదట దానిని గ్రహించలేదు. అప్పుడు నా స్నేహితులు ఆమె నిన్ను కొట్టుతోందని నాకు చెప్పారు. ఒక అమ్మాయి, ఇతర అమ్మాయిలలో తప్పులను మాత్రమే చూస్తుందని మనకు తెలిసిందే. అందుకే ఆ విషయం తెలిసి నేను నిజంగా చాలా సంతోషించాను. ఎందుకంటే.. ఆమె నన్ను కొడుతుందంటే దానర్థం ఆమెకన్నా నేను బావున్నట్లు ఆమె గుర్తించిందని. అందుకే అలా ప్రవర్తించింది. కాబట్టి ఆ సమయంలో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను’ అని చెప్పుకొచ్చింది.
మిథాలీ సైతం ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘నాకు కూడా ఒకటి, రెండు సార్లూ ఇలాంటివి ఎదురయ్యాయి. అయితే వారు కొట్టిన విషయం ఎవరో చెబితేగానీ నాకు తెలియదు. సాధారణంగా మ్యాచ్ అడుతున్నప్పుడు వేరే జట్టు సభ్యులు ఇలా చేస్తుంటారు’ అని తెలిపింది. అయితే.. తాప్సీ నటించిన తాజా చిత్రం ‘శభాష్ మిథు’ జులై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సృజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతోపాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి ‘డుంకీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ మూవీకి రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే.. అజయ్ బహల్ దర్శకత్వంలో ‘బ్లర్’, ప్రకాశ్ రాజ్ దర్శకత్వంలో ‘తడ్కా’, అనురాగ్ కశ్వప్ దర్శకత్వంలో ‘దో బారా’, వినిల్ మాథ్యూ దర్శకత్వంలో ‘హాసీన్ దిల్రూబా 2’లో నటిస్తూ కెరీర్లో ఎంతో బిజీగా ఉంది.