5గురు గాయకులతో హైద‌రాబాద్‌లో ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’

ABN , First Publish Date - 2022-07-17T20:18:25+05:30 IST

5గురు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మాన్ని వి‌కె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌ నిర్వ‌హించ‌బోతోంది. ఇది.. కోవిడ్ నేప‌థ్యంలో దాదాపు సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు అతి పెద్ద వేదిక కానుంది. ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’

5గురు గాయకులతో హైద‌రాబాద్‌లో ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’

5గురు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మాన్ని వి‌కె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌ నిర్వ‌హించ‌బోతోంది. ఇది.. కోవిడ్ నేప‌థ్యంలో దాదాపు సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు అతి పెద్ద వేదిక కానుంది. ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’ (Swara Monsoon Musical Masti) పేరుతో.. ఈ నెల 23న టాప్ సింగ‌ర్స్, మ్యూజీషియ‌న్స్‌తో జరిగే ఈ కార్యక్రమానికి శిల్పకళావేదిక వేదిక కానుంది. ఈ విషయం తెలుపుతూ శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని సంస్థ కార్యక్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజి, దామని, సింహా, అరుణ్ కౌండిన్య‌ మరియు తేజస్విని, వినయ కుమార్ కలిసి ఈ కచేరికీ సంబంధించిన పోస్టర్‌ను మరియు టికెట్‌ని విడుదల చేశారు.


ఈ సంద‌ర్భంగా వి‌కె ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు వినయ కుమార్ మరియు తేజస్విని మాట్లాడుతూ.. ‘‘వి‌కె ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’ పేరుతో మన టాలీవుడ్ టాప్ సింగర్స్ అయిన గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజి, సింహా, దామని మరియు అరుణ్ కౌండిన్య‌తో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జులై 23న మ్యూజిక్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించనున్నాము. ఈ మ్యూజిక్ మస్తీని సంగీత ప్రియులు బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాము. ఈ షో టికెట్స్ బుక్ మై షోలో లభిస్తాయి’’ అని అన్నారు. 

Updated Date - 2022-07-17T20:18:25+05:30 IST