Lock Upp : కంగనతో... సుస్మితా సేన్ మాజీ ప్రియుడు, బాలీవుడ్ బాంబ్ పూనమ్ పాండే!
ABN , First Publish Date - 2022-02-05T00:26:15+05:30 IST
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించబోతోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించబోతోన్న సంగతి తెలిసిందే. ఏక్తా కపూర్ ఈ రియాలిటీ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ షో ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనబోయేవారిలో ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ఈ షోలో పాల్గొనబోతోందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
రోహ్మాన్ షాల్ బాలీవుడ్లో అనేక మంది టాప్ డిజైనర్లకు మోడల్గా పనిచేశాడు. నటి ఎరికా ఫెర్నాండెజ్తో ఓ మ్యూజిక్ వీడియో చేశాడు. అంతేకాక ఈ మధ్యే సీనియర్ సుందరి సుస్మితా సేన్తో బ్రేకప్ చేసుకున్న ఆయన్ని రియాలిటీ షోలోకి తీసుకుంటే మంచి మైలేజ్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. అతడితో సంప్రదింపులు జరిపితే అంగీకారం తెలిపాడని బీ టౌన్ మీడియాలో గుసగులు వినిపిస్తున్నాయి. వివాదాలతో వార్తల్లో నిలిచే పూనమ్ పాండే కూడా పాల్గొనబోతుండటంతో షో ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే రోహ్మన్ షాల్తో ప్రేమ బంధానికి మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అతడితో విడిపోయిన అనంతరం సోషల్ మీడియాలో ఒక మెసేజ్ను పోస్ట్ చేసింది. ‘‘మేం స్నేహితులుగా పరిచయమయ్యం. అదే విధంగా ఉండిపోతాం. రిలేషన్ షిప్ మాత్రం ముగిసిపోయింది’’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.