క్షమాపణలు డిమాండ్ చేస్తోన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోయిన్.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-02-19T21:55:24+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అనంతరం సినీ ఇండస్ట్రీలో కథానాయికగా

క్షమాపణలు డిమాండ్ చేస్తోన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోయిన్.. కారణమేంటంటే..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అనంతరం సినీ ఇండస్ట్రీలో కథానాయికగా మారిన సుందరి సంజన సంఘీ. ‘రాక్ స్టార్’, ‘బార్ బార్ దేఖో’, ‘హిందీ మీడియం’ వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. దివగంత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’లో కథానాయికగా నటించి ఫేమ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ నటికి ఓ ఇబ్బంది ఎదురయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారంటోంది. అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే..


సంజన సంఘీ ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిమిత్తం అమెరికా ప్రయాణించాలనుకుంది. అందుకోసం అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు టిక్కెట్లు బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆమెతో ఘోరంగా ప్రవర్తించారు. గతంలోను పలుమార్లు ప్లైట్‌లోని క్రూ ఆమెతో ఈ విధంగానే ప్రవర్తించారంట. ఇటువంటి ఘటనలతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పాలంటోంది. ఈ సంఘటనను వివరిస్తూ ఇన్‌స్టా‌స్టోరీస్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టింది.‘‘ ఢిల్లీ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అమెరికన్ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణించాను. ఆ సమయంలో విమానసిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. గతంలోను పలుమార్లు ఈ విధంగానే చేశారు. ఈ ఉదంతానికి వివరణ ఇస్తూ తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దని నేను ఆశిస్తున్నాను’’ అని సంజన సంఘీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.   


సంజన ప్రస్తుతం ‘ఓం: ది బ్యాటిల్ విత్ ఇన్’ అనే మూవీలో నటిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె కనిపించనుంది. యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. అహ్మద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.



Updated Date - 2022-02-19T21:55:24+05:30 IST