Surya '24': క్రేజీ అప్‌డేట్..

ABN , First Publish Date - 2022-07-16T14:08:15+05:30 IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar).

Surya '24': క్రేజీ అప్‌డేట్..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar). ఆయన దర్శకత్వంలో సూర్య (Surya) హీరోగా రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం '24' (24). తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులోనూ విడుదలై మంచి హిట్ సాధించింది. అయితే, తాజాగా ఆయన ఈ మూవీ సీక్వెల్‌పై స్పందించారు. తెలుగులో అక్కినేని ఫ్యామిలీతో 'మనం' సినిమాను చేసి హాట్ టాపిక్ అయిన విక్రమ్ ఆ తర్వాత హలో, 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలతో కొత్త పాయింట్ ను టచ్ చేశారు. 


ఆ తరువాత సినిమాకి విక్రమ్ కుమార్ చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'థ్యాంక్యూ' (Thankyou) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya), రాశి ఖన్నా (Rashi Khanna) జంటగా.. మాళవిక నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కూడా ఓ కొత్త తరహాలోనే సాగనుందట. హీరో జర్నీలో తనకి తారసపడే వ్యక్తులు..అనుభవాలు..అనుభూతులు.. జ్ఞాపకాలతో ఈ కథ సాగుతుందట. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శడు. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ కుమార్ కోలీవుడ్ స్టార్ సూర్యతో చేసిన '24' సినిమా గురించి చెప్పారు.


ఆయన మాట్లాడుతూ.. 'నేను తెరకెక్కించిన సినిమాలలో '24' అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహా సినిమాలు అంతకుముందు తమిళంలోగానీ .. తెలుగులోగానీ రాలేదు. కథ పరంగా లోపాలు కనిపించకూడదు.. పాత్రల లుక్ డిఫరెంట్ గా ఉండాలి. ఇద్దరి సూర్యల పాత్రల మధ్య.. స్వభావాల మధ్య పూర్తి వైవిధ్యం ఉండాలి. ఇందుకోసం కాగితాలపైనే కాకుండా టెక్నికల్ గా కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూసుకోవాలి. అనుకున్న అవుట్ పుట్ రావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. 


అందుకే, ఇప్పటికీ టీవీలో ఈ సినిమాను చూడటానికి చాలామంది ఆసక్తిని చూపుతున్నారు. అంతేకాదు, 24 సినిమాకి సీక్వెల్ చేయమంటూ చాలామంది అడుగుతున్నారు. అందుకే, ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. సీక్వెల్ కూడా సూర్యతోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది".. అని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళూ '24' సినిమా సీక్వెల్ ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను విక్రమ్ కుమార్ నిజం చేశారు. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-16T14:08:15+05:30 IST