త్వరగా అక్కడ అడుగు పెట్టాలని ఉంది: ఐశ్వర్య రజినీకాంత్

ABN , First Publish Date - 2022-03-11T02:38:25+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో విడాకుల అనంతరం ఐశ్వర్య రజినీకాంత్

త్వరగా అక్కడ అడుగు పెట్టాలని ఉంది: ఐశ్వర్య రజినీకాంత్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో విడాకుల అనంతరం ఐశ్వర్య రజినీకాంత్ పలుమార్లు పతాకశీర్షికలకెక్కింది. ఐశ్వర్యకు మార్చి 7న రెండోసారి కరోనా సోకింది. తల తిరగడం, జ్వరం వంటి కరోనా అనంతర లక్షణాలతో ఆస్పత్రిలో చేరానని ఆమె వివరించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండంతో పనిని ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది. 


తాజాగా ఐశ్వర్య ‘ముసాఫిర్’ అనే ఆల్బమ్‌కు దర్శకత్వం వహించింది. ఈ ఆల్బమ్‌కు  ఆమే నిర్మాతగా వ్యవహరించింది. పలు భాషల్లో దీనిని తెరకెక్కిస్తోంది. ఈ పాటకు అంకిత్ తివారీ సంగీతం అందించారు. ఉమెన్స్ డే సందర్భంగా ఈ పాటకు సంబంధించిన టీజర్‌ను నాలుగు భాషల్లో విడుదల చేశారు. తాజాగా ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ముసాఫిర్’ ఆల్బమ్‌కు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది. షూటింగ్ సెట్లోకి త్వరగా అడుగుపెట్టాలని ఉందంటూ ఆమె చెప్పింది. తన ప్రాజెక్ట్ గురించి మరింతగా వివరిస్తూ... ‘‘మేం చేసింది చూస్తే... మీ కళ్ల ముందు మ్యాజిక్ కనిపిస్తుంది. మీరొక సరికొత్త లోకాన్ని సృష్టించుకుంటారు. మేం చేసినదంతా మీరెప్పుడు చూస్తారా అనే ఆత్రుతలో మేమంతా ఉన్నాం... ’’ అని ఐశ్వర్య తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. 


కెరీర్ పరంగా బిజీబిజీగా ఉన్న ఐశ్వర్య రజినీకాంత్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధనుష్‌, ఐశ్వర్య దంపతులుగా విడిపోతున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. పెళ్లి అయిన 18ఏళ్ల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా ప్రకటనను విడుదల చేశారు. అనంతరం వీరిద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇద్దరి తరఫు బంధువులు ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదని తెలుస్తోంది.



Updated Date - 2022-03-11T02:38:25+05:30 IST