Rajinikanth: మళ్లీ కలసిపోవాలని ధనుష్, ఐశ్వర్యలకు రజినీకాంత్‌ సూచన..!

ABN , First Publish Date - 2022-10-14T21:11:06+05:30 IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth), హీరో ధనుష్‌ (Dhanush) విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించారు.

Rajinikanth: మళ్లీ కలసిపోవాలని ధనుష్, ఐశ్వర్యలకు రజినీకాంత్‌ సూచన..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth), హీరో ధనుష్‌ (Dhanush) విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించారు. 18ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా పోస్ట్‌లు పెట్టారు. కాగా, మళ్లీ వీరిద్దరు కలవబోతున్నారనే వార్తలు కొంతకాలంగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంటకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ జంటతో మాట్లాడినట్టు తెలుస్తోంది. విభేదాలను మరిచిపోయి కలసిపోవాలని సూచించినట్టు తెలుస్తోంది.   


ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ కలసిపోవడానికి మరోసారి ప్రయత్నించాలని రజినీకాంత్ చెప్పారట. రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరారట. ఇదే విషయంపై ధనుష్ తండ్రి కస్తూరి రాజాను స్పందించమని కోరగా తనకేమీ తెలియదని చెప్పడం గమనార్హం. ‘‘మా పిల్లల నుంచి సహాయం తీసుకోకుండగానే నేను, నా భార్య సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం. వారు కూడా సంతోషంగా జీవితాన్ని ఉండాలని మేం అనుకుంటున్నాం. వారి సంతోషానికి హానీ చేసేది ఏదైనా మాకు సమస్యగానే కనిపిస్తుంది. వారు ఆనందంగా ఉంటెనే మేం కూడా ఆనందంగా ఉంటాం’’ అని కస్తూరి రాజా పేర్కొన్నాడు. ధనుష్, ఐశ్వర్య తొమ్మిది నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఓ పార్టీలో ఎదురెదురు పడినప్పటికి పలకరించుకోలేదని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ జంటకు యాత్రా (Yatra), లింగ (Linga) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకులు ప్రకటన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడ కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం యాత్రా స్కూల్ ఈవెంట్‌లో వీరిద్దరు జోడీగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారని వదంతులు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. అయితే, వీరిద్దరు మరల కలుస్తారా లేదా అనేది తెలియాంటే మాత్రం కొంత కాలం వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-10-14T21:11:06+05:30 IST