మరోసారి ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య రజినీకాంత్..కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-03-07T21:05:33+05:30 IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య మార్చి 7న ఆస్పత్రిలో చేరింది

మరోసారి ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య రజినీకాంత్..కారణమేంటంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య మార్చి 7న ఆస్పత్రిలో చేరింది. జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలతో హాస్పిటల్‌లో చేరానని పేర్కొంది. కరోనా అనంతర లక్షణాలతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఐశ్వర్యకు ఫిబ్రవరి 1న కోవిడ్‌ సోకింది. అప్పుడు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం షూటింగ్‌లో బిజీ అయిపోయింది. ‘ముసాఫిర్’ అనే మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించింది. 


హాస్పిటల్‌లో తనకు చికిత్సను అందిస్తున్న డాక్టర్‌‌కు ఐశ్వర్య కృతజ్ఞతలు చెప్పింది. డాక్టర్ ప్రితీకా చారిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టింది. ఆమెతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘జ్వరం, తల తిరగడం వంటి కరోనా అనంతర లక్షణాలతో ఆస్పత్రిలో చేరాను. కానీ, స్ఫూర్తివంతమైన, అందమైన డాక్టర్‌ ప్రితీకా చారిని కలిసి సమయాన్ని వెచ్చిస్తే అది అస్వస్థతగా అనిపించదు. ఉమెన్స్ డే కు ఇంతకంటే మంచి ఆరంభం ఏముంటుంది. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది మేడం’’ అని ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 


దాదాపుగా రెండు నెలల క్రితమే ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి అందరిని షాక్‌కు గురి చేశారు. 18ఏళ్ల దాంపత్య జీవితానికి వీడ్కోలు పలుకుతున్నామంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 



Updated Date - 2022-03-07T21:05:33+05:30 IST