EMK: నీకంటే నీ గురువే బెటర్.. ఎన్టీఆర్ని టీజ్ చేసిన మహేష్
ABN , First Publish Date - 2021-11-24T03:04:17+05:30 IST
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ.. ఈ షోని రక్తికట్టిస్తున్నారు. సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ.. ఈ షోని రక్తికట్టిస్తున్నారు. సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ షోకి హాజరై వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత, దేవిశ్రీ ప్రసాద్, థమన్, రాజమౌళి, కొరటాల శివ వంటి వారు హాట్ సీట్లో కూర్చుని ఎన్టీఆర్తో ఈ గేమ్ ఆడారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొన్నట్లుగా తాజాగా షో నిర్వాహకులు ఓ ప్రోమోని విడుదల చేశారు.
తనకి అత్యంత ఇష్టమైన వారిలో ఒకరైన మహేష్ని.. ఎన్టీఆరే కావాలని కోరి తెచ్చుకుని మరీ పంచులు వేయించుకున్నట్లుగా ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఎన్టీఆర్ అడిగిన ఒక ప్రశ్నకి.. ‘ఇలా తిప్పి తిప్పి ఎందుకు అడగడం’ అని మహేష్ అంటే.. ‘ఊరికే సరదాగా’ అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ‘అయ్య బాబోయ్.. నీకంటే కంప్యూటర్ గురువుగారే బెటర్గా ఉన్నాడు’ అని ఎన్టీఆర్ని సరదాగా మహేష్ టీజ్ చేస్తున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ఏదిఏమైనా ఇద్దరు బడా స్టార్స్ని ఇలా ఒకే ఫ్రేమ్లో చూడటం అనేది.. అభిమానులకు మాత్రం పండగే అని చెప్పవచ్చు. ఈ షో డిసెంబర్ 2వ తేదీని టెలికాస్ట్ కాబోతున్నట్లుగా వార్తలైతే వినవస్తున్నాయి కానీ.. అధికారికంగా మాత్రం షో నిర్వాహకులు ప్రకటించలేదు.