తిహార్ జైలు సిబ్బంది‌కి నెలకు రూ.కోటి లంచం.. Sukesh Chandrasekhar కేసులో మరో ట్విస్ట్..

ABN , First Publish Date - 2021-12-18T22:48:00+05:30 IST

తిహార్ జైలు సిబ్బంది‌కి నెలకు రూ.కోటి లంచం.. Sukesh Chandrasekhar కేసులో మరో ట్విస్ట్..

తిహార్ జైలు సిబ్బంది‌కి నెలకు రూ.కోటి లంచం.. Sukesh Chandrasekhar కేసులో మరో ట్విస్ట్..

ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. అతడి నేరాల కారణంగా ఢిల్లీ నుంచీ ముంబై దాకా అనేక మందికి ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు.  రూ. 200కోట్ల మోసం కేసులో అరెస్ట్ అయిన సుఖేశ్ తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో స్వేచ్ఛగా తిరిగేందుకు, అవసరమైన వసతులు కల్పించేందుకు అతడు జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ. కోటికి పైగా లంచం ఇచ్చాడని తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. 


కొన్నిరోజుల క్రితం రూ. 200కోట్ల మోసం కేసులో ఢిల్లీ పోలీసులు సుఖేశ్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. జైలుకి వెళ్లినప్పటికి కూడా అతడు తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోలేదు. జైలు నుంచి కూడా నేరాలకు పాల్పడినట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. జైలు సిబ్బందికి లంచం ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జైల్లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేందుకు 15రోజులకు గాను దాదాపుగా రూ.50లక్షలకు పైగా సిబ్బందికి లంచం ఇచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


సుఖేశ్ చంద్ర శేఖర్ జైలులో ఉన్నప్పటికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీతో పాటు అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి కలిసేవారిని తెలుస్తోంది. ఈ హీరోయిన్‌లు మాత్రమే కాకుండా మోడల్స్ కూడా వచ్చే వారని వార్తలు వెలువడుతున్నాయి. జైలు సిబ్బందికి పలుమార్లు భారీ స్థాయిలో పార్టీలు ఇచ్చేవాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తిహార్ జైలు సిబ్బంది తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అధికారులకు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశాడు. తనకు వసతులు సరిగ్గా కల్పించడం లేదని ఆరోపిస్తున్నాడు. తన భార్యను కూడా కలుసుకోనివ్వకుండా చేయడంతో మానసికంగా కుంగిపోతున్నానని స్పష్టం చేశాడు. 

Updated Date - 2021-12-18T22:48:00+05:30 IST