‘యానిమల్’ సెట్ నుంచి రష్మిక, రణ్‌బీర్ ఫొటోలు లీక్

ABN , First Publish Date - 2022-04-23T23:10:15+05:30 IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనంతరం ఇదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు.

‘యానిమల్’ సెట్ నుంచి రష్మిక, రణ్‌బీర్ ఫొటోలు లీక్

‘అర్జున్ రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనంతరం ఇదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. సందీప్ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘యానిమల్’. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మనాలీ‌లో పూజ కార్యక్రమాలతో ఏప్రిల్ 22న ప్రారంభమైంది.

 

‘యానిమల్’ షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే సెట్ నుంచి రణ్ బీర్‌కపూర్, రష్మిక మందన్న ఫొటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో.. రణ్‌బీర్ కపూర్ తెల్ల కుర్తా ధరించగా, రష్మిక మందన్న ఎరుపు, తెలుపు రంగులతో కూడిన చీరను ధరించింది. రష్మిక ఈ మూవీలో గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదటగా పరిణీతి చోప్రాను అనుకున్నారు. కానీ, ఆమెకు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం ఈ మూవీలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు.‘యానిమల్’ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.



Updated Date - 2022-04-23T23:10:15+05:30 IST