బాలీవుడ్ ఎప్పటికి అంతం కాదంటున్న Rohit Shetty

ABN , First Publish Date - 2022-05-29T22:17:45+05:30 IST

బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’ (Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియాగా రూపొందిన ‘కెజియఫ్’(KGF),

బాలీవుడ్ ఎప్పటికి అంతం కాదంటున్న Rohit Shetty

బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’ (Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియాగా రూపొందిన ‘కెజియఫ్’(KGF), ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) బీ టౌన్‌లో భారీ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీల వారు సినిమాలను హిందీలోకి డబ్ చేస్తున్నారు. దీంతో సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. కొన్ని రోజుల క్రితం విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) మాట్లాడాడు. 


దక్షిణాది సినిమాలను బాలీవుడ్ ఎప్పటి నుంచో రీమేక్ చేస్తుందని రోహిత్ శెట్టి తెలిపాడు. అదేమీ కొత్త ట్రెండ్ కాదని చెప్పాడు. ‘‘ప్రస్తుతం బాలీవుడ్ పని అయిపోయిందటున్నారు. కానీ, అది ఎప్పటికీ జరగదు. 1980లో వీసీఆర్‌లు వచ్చాయి. థియేటర్స్ నడవవు అని ప్రజలు చెప్పారు. ఈ మధ్య ఓటీటీ బూమ్ వచ్చింది. చాలా మంది బాలీవుడ్ పని అయిపోయిందని చెబుతున్నారు. బాలీవుడ్ ఎప్పటికీ అంతం కాదు. ఓ సారి చరిత్రను పరిశీలిస్తే దక్షిణాది సినిమాలు అకస్మాత్తుగా వచ్చి కలెక్షన్స్‌ను‌ కొల్లగొట్టడం లేదు. 1950, 1960ల నుంచే సౌత్ మూవీస్‌ను రీమేక్ చేస్తున్నారు. శశి కపూర్ నటించిన ‘ప్యార్ కియో జా’ ఓ తమిళ సినిమాకు రీమేక్. జితేంద్ర గారి ‘హిమ్మత్ వాలా’, ‘మావాలి’ చిత్రాలు కూడా దక్షిణాది చిత్రాల రీమేకే’’ అని రోహిత్ శెట్టి చెప్పాడు. 


సౌత్ నుంచి వచ్చిన శ్రీదేవి, జయ ప్రద వంటి హీరోయిన్స్ బాలీవుడ్‌ను ఏలారని రోహిత్ శెట్టి పేర్కొన్నాడు. ‘‘మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమా ఇండస్ట్రీని విపరీతంగా మార్చింది. రామ్ గోపాల్ వర్మ ఓ యాక్షన్ చిత్రాన్ని నాగార్జునతో తెరకెక్కించాడు. బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్ దక్షిణాదికి చెందినవాడు’’ అని రోహిత్ శెట్టి వెల్లడించాడు. ఇక కెరీర్ విషయానికీ వస్తే.. రోహిత్ శెట్టి ‘సర్కస్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్ వీర్‌సింగ్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్‌మస్ సందర్భంగా విడుదల కానుంది. 

Updated Date - 2022-05-29T22:17:45+05:30 IST