SSMB29 : సెట్‌పైకి వచ్చేది అప్పుడేనా..?

ABN , First Publish Date - 2022-07-15T13:51:26+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో వచ్చి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో

SSMB29 : సెట్‌పైకి వచ్చేది అప్పుడేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో వచ్చి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ మీదకు రాబోతున్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.


దీనికి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli)తో భారీ పాన్ ఇండియా మూవీని చేయనున్నారు మహేష్. ఈ మూవీ ఆయన కెరీర్ 29వది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని భారీ స్టార్ క్యాస్టింగ్ తో అత్యంత భారీ లెవెల్లో శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా. కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మించనున్నారు. 


అయితే, ఈ చిత్రాన్ని అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి రూపొందించనున్నారు. ఇక, వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ భారీ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురానున్నారట. ఇప్పటికే మూవీ స్టోరీ విషయమై విజయేంద్ర ప్రసాద్ తో కలిసి వర్క్ స్టార్ట్ చేసిన రాజమౌళి, ఈ వర్క్ పూర్తి కాగానే పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ పై దృష్ఠి పెట్టనున్నారట. కాగా, 2023 ప్రారంభంలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టేలా సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీ కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ళపాటు లాకవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మహేష్ - రాజమౌళి సినిమాపై ఇప్పుడు నెలకొన్న అంచనాలు అసాధారణం. 

Updated Date - 2022-07-15T13:51:26+05:30 IST