SSMB29: ఇది నిజమేనా..?

ABN , First Publish Date - 2022-07-03T16:37:40+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్వరలో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.

SSMB29: ఇది నిజమేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్వరలో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ అధినేత డా. కె ఎల్ నారాయణ (Dr K L Narayana) అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ క్రేజీ మూవీపై ఇప్పటీకే ప్రపంచవ్యాప్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి మహేష్‌తో ఎప్పుడో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే, మధ్యలో ఇద్దరూ వరుసగా సినిమాలు కమిటవడంతో ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ఇన్నేళ్ళ సమయం పట్టింది.


ఇన్నేళ్ళ నుంచి ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ ఫైనల్‌గా సినిమా మొదలవబోతుందని ఇటీవల ఇంటర్వ్యూల్లో మహేష్ తెలియచేసారు. అయితే, ఈ సినిమాను భారీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ తరహ కథ కోసమే కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. 


అయితే, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డా. కేఎల్ నారాయణ తోపాటు బాహుబలి (Bahubali) మూవీస్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన శోభు యార్లగడ్డ (Sobhu Yarlagadda) కూడా కలిసి నిర్మించనున్నారని తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల కమల్ కన్నన్, శోభు యార్లగడ్డ లతో కలిసి రాజమౌళి ఫ్రాన్స్ లోని యూనిట్ ఇమేజ్ 3డి ఎఫెక్ట్స్ స్టూడియోను సందర్శించిన విషయం తెలిసిందే. దాంతో, ఆయన కూడా ఈ భారీ చిత్రానికి ఓ నిర్మాత అని ప్రచారం అవుతోంది. మరి వార్తలపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాజమౌళి సినిమా ఉంటుంది. 

Updated Date - 2022-07-03T16:37:40+05:30 IST