Srinidhi Shetty కావాలంటున్న ఎన్టీఆర్ ఫాన్స్..!

ABN , First Publish Date - 2022-05-26T19:25:22+05:30 IST

శ్రీ‌నిధి శెట్టి (Srinidhi Shetty).. చేసింది ఒక్క (KGF) సినిమానే అయినా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయిందీ ఈ కన్నడ బ్యూటీ. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధికి `కేజీఎఫ్‌` (KGF) సిరీస్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది.

Srinidhi Shetty కావాలంటున్న ఎన్టీఆర్ ఫాన్స్..!

శ్రీ‌నిధి శెట్టి (Srinidhi Shetty).. చేసింది ఒక్క (KGF) సినిమానే అయినా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయిందీ ఈ కన్నడ బ్యూటీ. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధికి `కేజీఎఫ్‌` (KGF) సిరీస్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ మూవీలో రాఖీభాయ్‌కు రాణీగా నటించిన శ్రీ‌నిధి శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. అందం హుందాతనం కలిపిన రోల్‌లో శ్రీనిధి ఆకట్టుకుంది. దీంతో అన్ని భాష‌ల నుంచీ ఈ బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వస్తున్నాయి. అయినా శ్రీ‌నిధి మాత్రం అప్ కమింగ్ మూవీల‌ను చాలా జాగ్ర‌త్త‌గా సెలెక్ట్ చేస్తోంది. ప్ర‌స్తుతం శ్రీనిధి శెట్టి త‌మిళ స్టార్ విక్ర‌మ్ (Vikram) సరసన `కోబ్రా` (Cobra) సినిమాలో నటిస్తుంది. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగ‌స్టు 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. 


అయితే, ఇటీవల ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శ్రీనిధి, ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చి ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్ర‌శ్నిస్తే.. ఆ రెండిటిలో నాకు మాత్రం డ‌బ్బే కావాలంటూ బోల్డ్ కామెంట్ చేసింది. శ్రీనిధి ఇచ్చిన ఈ సమాధానంతో కొంతమంది, ఆమెపై పేరు కన్నా డబ్బే ముఖ్యమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం, ఈ లోకంలో డబ్బు ఉంటే ఏమైనా సాదించోచ్చు. కాబట్టి, శ్రీనిధి చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. ఇదిలా ఉంటే తనకి లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel), తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR)తో చేస్తున్నాడు.


ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని తారక్ ఫాన్స్ కోరుకుంటున్నారట. అటు ప్రశాంత్ నీల్‌కి  ఇటు ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కేజీఎఫ్ సిరీస్‌తో శ్రీనిధికి మంచి క్రేజ్ దక్కింది. అందుకే, ఎన్టీఆర్ 31 లో శ్రీనిధి ఉండాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్‌ ఫాన్స్. మరి అభిమానులు అశించినట్టుగా ప్రశాంత్ నీల్, తారక్ - శ్రీనిధి శెట్టిల కాంబినేషన్‌ను సెట్ చేస్తాడా లేదా చూడాలి. ఇక ఈ మూవీ 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  

Updated Date - 2022-05-26T19:25:22+05:30 IST