అల్లు హీరోతో శ్రీవిష్ణు మల్టీస్టారర్ ?

ABN , First Publish Date - 2022-01-28T19:34:50+05:30 IST

ప్రస్తుతం అల్లు అరవింద్ ఫ్యామిలీలో అందరూ సినిమాలతో యాక్టివ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ సంగతి తెలిసిందే. ఇక పెద్ద కుమారుడు బాబీ సైతం వరుణ్ తేజ్ తో ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక మిగిలింది అల్లు శిరీశ్. చివరగా ఈ హీరో 2019 లో ‘ఏబీసీడీ’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయల్ కథానాయికగా ‘ప్రేమ కాదంట’ అనే మూవీలో నటిస్తున్నాడు. తాజాగా అల్లు శిరీశ్ మరో ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడట. అతడు మరెవరో కాదు శ్రీవిష్ణు.

అల్లు హీరోతో శ్రీవిష్ణు మల్టీస్టారర్ ?

ప్రస్తుతం అల్లు అరవింద్ ఫ్యామిలీలో అందరూ సినిమాలతో యాక్టివ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు బాబీ  వరుణ్ తేజ్ తో ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక మిగిలింది అల్లు శిరీశ్. చివరగా ఈ హీరో 2019 లో ‘ఏబీసీడీ’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయల్ కథానాయికగా ‘ప్రేమ కాదంట’ అనే మూవీలో నటిస్తున్నాడు. తాజాగా  అల్లు శిరీశ్ మరో ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడట. అతడు మరెవరో కాదు శ్రీవిష్ణు.


ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మించనుంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియదు. శ్రీవిష్ణు గతంలో వేరే హీరోలతో సినిమాలు చేశాడు. కానీ శిరీశ్ ఇంత వరకూ మరో హీరోతో నటించలేదు. ఈ సినిమా గురించి ప్రకటన వెలువడనుంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసి.. సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో త్వరలోనే దర్శకుడు, ఇతర కేస్టింగ్ వివరాలు వెల్లడిస్తారు. మరి ఈ ఇద్దరిహీరోలతో ఏ తరహా చిత్రం రానుందో చూడాలి. 

Updated Date - 2022-01-28T19:34:50+05:30 IST