ఇద్దరు లెజెండ్స్ ఒకే చోట.. ఫొటో వైరల్

ABN , First Publish Date - 2022-04-01T02:35:34+05:30 IST

ఒకరేమో తన నటనతో ఎనలేని కీర్తిని గడిస్తే.. మరొకరు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు. దగ్గరదగ్గరగా ఇద్దరిదీ ఒకే వయసు. 90 సంవత్సరాలు పైబడినా..

ఇద్దరు లెజెండ్స్ ఒకే చోట.. ఫొటో వైరల్

ఒకరేమో తన నటనతో ఎనలేని కీర్తిని గడిస్తే.. మరొకరు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు. దగ్గరదగ్గరగా ఇద్దరిదీ ఒకే వయసు. 90 సంవత్సరాలు పైబడినా.. ఇప్పటికీ ఇద్దరిలో పోటీపడే తత్వం అలానే ఉందంటే అతిశయోక్తి కానే కాదు. ఇంతకీ ఎవరా ఇద్దరు లెజెండ్స్ అనుకుంటున్నారు కదా.. ఇంకెవరు షావుకారు జానకి, పి. సుశీల. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 370కి పైగా సినిమాల్లో షావుకారు జానకి నటిస్తే.. అనేక భాషల్లో 50 వేలకి పైగా పాటలు పాడారు పి. సుశీలమ్మ. అలాంటి లెజెండ్స్ ఒకే చోట కనిపిస్తే.. నిజంగా వారిని చూడడానికి రెండు కళ్లు చాలవు. అలాంటి సందర్భాన్నే వారు తాజాగా ప్రేక్షకులకు కలిగించారు.


తన చిన్ననాటి స్నేహితురాలైన పి. సుశీలమ్మను తాజాగా షావుకారు జానకి కలిశారు. కొన్ని గంటల పాటు సుశీలమ్మ ఇంటి వద్ద వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లెజెండ్స్ ఇద్దరినీ ఒకేచోట ఇలా చూడటం.. చాలా సంతోషంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 



Updated Date - 2022-04-01T02:35:34+05:30 IST