Sonam Kapoor: కొడుకును భారత్లో చదివించడంపై సోనమ్ కపూర్ కామెంట్స్.. ఇక్కడ అది కష్టమంటూ..
ABN , First Publish Date - 2022-08-24T20:55:55+05:30 IST
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సోనమ్ కపూర్ (Sonam Kapoor) ఒకరు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే..
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సోనమ్ కపూర్ (Sonam Kapoor) ఒకరు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ వ్యాపారవేత్త ఆనంద్ అహూజా (Anand Ahuja)ని 2018లో వివాహం చేసుకుంది. గతేడాది ఈ భామ ప్రెగ్నెంట్ అవ్వగా.. ఈ ఏడాది ఆగస్టు 20న ఓ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ బ్యూటీ ఇటీవలే వోగ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై కనిపించింది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలల గురించి నిష్కల్మషంగా మాట్లాడింది. అలాగే ఆమె బిడ్డ భవిష్యత్తు గురించి కూడా చెప్పుకొచ్చింది.
సోనమ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్థన్ని.. మా తల్లిదండ్రులు అనిల్ కపూర్(Anil Kapoor), సునీతా కపూర్ చాలా గోప్యంగా.. జనాల దృష్టిలో పడకుండా పెంచారు. అలా ఎలా ఉంచగలిగారో నాకు తెలియదు. అది మాకు మా బాల్యం సాధారణంగా గడపడానికి సహాయపడుతుంది. ఎంతలా అంటే.. నేను స్టార్ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్ చదివాను. అక్కడ మా కారులో దిగడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. జూనియర్ కాలేజ్ కోసం బోర్డింగ్ స్కూల్కి వెళ్లాను. అక్కడ ఇంకా చాలా నేర్చుకున్నాను.
అలాంటి నా పిల్లలకు కూడా ఉండాలనే నేను ఫీల్ అవుతాను. నిజం చెప్పాలంటే.. నా కొడుకుకి ఇండియాలో చదివించాలా లేక లండన్లో చదివించాలా అనే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకునేవి. అయితే.. భారత్లో ఉంటే నా ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అవుతాను. నేను వందశాతం ముంబై అమ్మాయిని. కానీ మాకు ఇక్కడ ఓ సమస్య ఉంది. నేను నా బిడ్డను ఇక్కడ పెంచితే గోప్యత కష్టమవుతుంది. అయితే చాలామంది స్టార్ కిడ్స్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత ఆ అడ్డును చాలా సులువుగా దాటగలమని అనిపించింది. దానికి గురించి మా అబ్బాయి స్కూల్కి వెళ్లేటప్పుడు చూస్తాం’ అని చెప్పుకొచ్చాడు.