అదే గది.. అదే కుర్చీ.. అదే కేన్సర్ ఆస్పత్రి.. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న Sonali Bendre..

ABN , First Publish Date - 2022-07-14T19:51:37+05:30 IST

‘మురారీ’, ‘మన్మథుడు’, ‘ఇంద్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి..

అదే గది.. అదే కుర్చీ.. అదే కేన్సర్ ఆస్పత్రి.. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న Sonali Bendre..

‘మురారీ’, ‘మన్మథుడు’, ‘ఇంద్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి సోనాలీ బింద్రే (Sonali Bendre). విజయవంతమైన చిత్రాలతో ఇతర సౌతిండియన్ ఇండస్ట్రీలతోపాటు బాలీవుడ్‌ (Bollywood)లోనూ మంచి గుర్తింపునే సాధించింది. గత కొన్నేళ్లక్రితం ఈ బ్యూటీకి క్యాన్సర్ (Cancer) వచ్చిన విషయం తెలిసిందే. 2018లో ఆ వ్యాధి సోకగా.. మనో ధైర్యంతో ఎదుర్కొని అందులో నుంచి బయటపడింది. ఈ తార కథ ఎంతోమంది క్యాన్సర్ పెషెంట్లకి సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్న ఆసుపత్రిని ఇటీవలే సోనాలీ సందర్శించింది. దీంతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. క్యాన్సర్‌తో పోరాడుతూ తన భర్త గోల్డీ బెహ్ల్‌తో కలిసి కూర్చున్న పిక్స్‌తోపాటు తాజాగా అదే చోటు ఆమె పిక్స్ ఉన్న వీడియోని షేర్ చేసింది. దానికి.. ‘ఇదే కుర్చీ, ఇదే వ్యూ, ఇదే ఖచ్చితమైన ప్రదేశంలో.. 4 సంవత్సరాల తర్వాత. భయకరమైన బాధ నుంచి నిరంతర ఆశ వరకు.. చాలా పరిస్థితులు మారిపోగా.. అలాగే చాలా మారకుండా అలాగే ఉన్నాయి.

 

అక్కడ కూర్చుని లోపలికి వెళ్తున్న పేషెంట్లను చూస్తున్నప్పుడూ.. ఒకప్పుడు నేను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను కదా అనిపించింది. కీమోథెరపీ సూట్ చూశాను. అదే వెయిటింగ్ రూమ్.. కానీ మనుషులు మారారంతే. ఆశతో ఉండమని అక్కడి రోగులకి చెప్పాలనిపించింది. నేను గతంలోనే జీవితంలోని మరోవైపుని చూసి వచ్చాను. మీరు ఊహించినట్లుగానే.. ఇది చాలా చేదు అనుభవాలతో కూడిన భావోద్వేగమైన రోజు. నేను ఆ బాధ నుంచి బయటపడి ముఖం మీద కాంతితో నా కొడుకు కళ్లలోకి చూశాను. నాకు అందిన ప్రతిదానికీ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాను’ అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దీంతో ఎంతోమంది సోనాలీ అభిమానులతో పాటు శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్, మనీషా కోయిరాలా, దియా మీర్జా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పోస్ట్‌పై స్పందించారు. ‘మీరు చాలా మందికి స్ఫూర్తి’ అంటూ హార్ట్ ఎమోజీలను కామెంట్స్‌లో షేర్ చేశారు. కాగా.. 2002లో గోల్డీ బెహ్ల్‌ను సోనాలి బింద్రే వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు రణవీర్ బెహ్ల్ అనే 15 ఏళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు.



Updated Date - 2022-07-14T19:51:37+05:30 IST