Bigg Boss 5 Telugu: డౌటే లేదు.. అతడే విన్నర్.. ఎలిమినేట్ అయ్యాక సిరి కామెంట్స్..
ABN , First Publish Date - 2021-12-20T02:27:37+05:30 IST
టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ను బిగ్బాస్ హౌజ్లోకి వెళ్లారు. లోపల వారు హౌస్మేట్స్తో కాలు కదిపారు. తర్వాత ఫైనల్ కంటెస్టెంట్స్ ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు..
బిగ్బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. విన్నర్ ప్రకటనకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బాలీవుడ్, టాలీవుడ్ అతిథులతో కార్యక్రమం సందడి సందడిగా సాగుతోంది. బిగ్బాస్ స్టేజిపై పుష్ప టీం సందడి చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ను బిగ్బాస్ హౌజ్లోకి వెళ్లారు. లోపల వారు హౌస్మేట్స్తో కాలు కదిపారు. తర్వాత ఫైనల్ కంటెస్టెంట్స్ ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు. ఇందులో సిరి ఫొటో ఉన్న డ్రోన్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దీంతో రష్మిక, దేవి శ్రీ ప్రసాద్.. సిరిని తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారు.
బిగ్బాస్ షో నుంచి బయటికి వచ్చాక సిరి మాట్లాడుతూ.. ‘‘19మంది కంటెస్టెంట్లలో ఒకరిగా వచ్చిన నేను టాప్-5లో నిలవడం సంతోషంగా ఉంది. బిగ్బాస్ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు ఎమోషనల్ అయ్యా. ఏదైనా హౌస్లో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. నా దృష్టిలో సీజన్-5 విన్నర్(షణ్ముఖ్)ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు .మీరు లేనిదే నేను లేను’’ అని భావోద్వేగానికి గురైంది.
మరోవైపు అక్కినేని నాగార్జున.. టాప్-5 కంటెస్టెంట్స్తో బ్రహ్మాస్త్రం గేమ్ ఆడించాడు. అనంతరం రాజమౌళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను పడ్డ కష్టాల నుంచి ప్రస్తుత జీవితం వరకూ ముఖ్యమైన ఘట్టాలను చెప్పుకొచ్చాడు సన్నీ. తర్వాత గేమ్ మానస్ వైపుకు వెళ్లింది. తనలోని పవర్ ఏంటో చెప్పమని నాగార్జున అడగ్గా.. అన్నీ ఆలోచించి సరైనా నిర్ణయం తీసుకోవడమే తన పవర్ అని తెలిపాడు. అలాగే శ్రీరామ్ మాట్లాడుతూ సెల్ఫ్లెస్గా ఉండడమే తన పవర్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సాయి మానస్ చెప్పిన సమాధానం నచ్చిందంటూ రాజమౌళి తెలిపాడు.