శింబు తాజా చిత్రం షూటింగ్ పూర్తి

ABN , First Publish Date - 2022-04-15T19:45:53+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో.. శింబు ఇటీవల ‘మానాడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చాన్నాళ్ళ తర్వాత శింబు ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కైవసం చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో శింబు తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ దీనికి గౌతమ్ మీనన్ దర్శకుడు కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది. చిత్రం పేరు ‘వెందు తనిందదు కాడు’ (ఒంటరిగా తగలబడుతున్న అడవి). యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో శింబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్.

శింబు తాజా చిత్రం షూటింగ్ పూర్తి

కోలీవుడ్ స్టార్ హీరో.. శింబు ఇటీవల ‘మానాడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చాన్నాళ్ళ తర్వాత శింబు ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కైవసం చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  ఈ క్రమంలో శింబు తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ దీనికి గౌతమ్ మీనన్ దర్శకుడు కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది. చిత్రం పేరు ‘వెందు తనిందదు కాడు’ (ఒంటరిగా తగలబడుతున్న అడవి).  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో శింబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. 


సిద్ధి ఇరానీ కథానాయికగా నటిస్తుండగా.. రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా సిద్ధిఖ్, నీరజ్ మాధవ్, ఏంజలీనా అబ్రహం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై బి.జయమోహన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదువు కోసం సిటీ వెళ్ళిన ఓ బడుగు వర్గాల యువకుడు.. తన వర్గానికి గుర్తింపు కోసం ఎలాంటి పోరాటం చేశాడు అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు ‘వినైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమైయ్యడా’ చిత్రాలతో సక్సెస్ అందుకున్న శింబు, గౌతమ్ మీనన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. 



Updated Date - 2022-04-15T19:45:53+05:30 IST