శింబు సరసన హీరోయిన్‌గా ఆమె ఫిక్స్

ABN , First Publish Date - 2022-01-04T02:24:45+05:30 IST

వేల్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై శింబు హీరోగా నిర్మాత డాక్టర్‌ ఐసరి గణేశ్‌ ‘వెందు తనిందదు కాడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గౌతం వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా

శింబు సరసన హీరోయిన్‌గా ఆమె ఫిక్స్

వేల్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై శింబు హీరోగా నిర్మాత డాక్టర్‌ ఐసరి గణేశ్‌ ‘వెందు తనిందదు కాడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గౌతం వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సిద్ధి ఇద్నానీని ఎంపిక చేశారు. సాధారణంగా గౌతం మీనన్‌ సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాత్రలు ఎంతో మెచ్చుకోదగినవిగా, కీలకమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా వర్థమాన నటీనటులు గౌతం మేనన్‌ చిత్రాల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుని మంచి పేరు గడించారు. ఇపుడు అలాంటి అవకాశం ఉత్తరాది భామ సిద్ధి ఇద్నానీని వరించింది. 


ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా శింబు సరసన సిద్ధి ఇద్నానీని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటుండగా, చివరి దశ షూటింగ్‌ మాత్రం ముంబైలో చేయనున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలోని పాటల్లో ‘మరక్కుమా నెంజం’ అనే పాటను ఇటీవల రిలీజ్‌ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Updated Date - 2022-01-04T02:24:45+05:30 IST