సీఎం వైఎస్ జగన్‌తో చిరు కీలక భేటీ.. లెక్క తేలిపోతుందా..!

ABN , First Publish Date - 2022-01-13T15:05:25+05:30 IST

గత కొన్ని రోజుల నుంచి ఏపీలో టికెట్ ధరలు సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించిన విషయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,

సీఎం వైఎస్ జగన్‌తో చిరు కీలక భేటీ.. లెక్క తేలిపోతుందా..!

గత కొన్ని రోజుల నుంచి ఏపీలో టికెట్ ధరలు సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించిన విషయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిల మధ్య కూడా ట్వీట్ల వార్ తర్వాత చర్చలు జరిపారు. అదే క్రమంలో టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు సహా హీరోలకి మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నేతలకి మద్య చాలాసార్లు కీలక సమావేశాలు జరిగాయి. 


అయితే, ఇప్పటి వరకు సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలు సహా చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేదుకు సమావేశం కానున్నట్టు తాజా సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవి - సీఎం జగన్‌ల మధ్య చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీతో దాదాపు టికెట్ లెక్కలు తేలిపోతాయని టాలీవుడ్‌లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-13T15:05:25+05:30 IST