అందాల పోటీ ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్న Shivani Rajasekhar.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-06-30T01:13:13+05:30 IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కుమార్తె శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar).. ఫెమినా మిస్ ఇండియా 2022 (Femina Miss India 2022) అందాల పోటీలో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అందాల పోటీకి సంబంధించి త్వరలో

అందాల పోటీ ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్న Shivani Rajasekhar.. కారణమిదే!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కుమార్తె శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar).. ఫెమినా మిస్ ఇండియా 2022 (Femina Miss India 2022) అందాల పోటీలో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అందాల పోటీకి సంబంధించి త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఆమె తమిళనాడు తరపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా.. అనివార్య పరిస్థితుల కారణంగా ఆమె ఈ బ్యూటీ రేసు నుండి భారీ హృదయంతో వీడ్కోలు పలుకుతున్నట్లుగా.. తాజాగా శివాని రాజశేఖర్ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది. అందుకు కారణం కూడా ఆమె తెలిపింది. 


ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆమె.. మెడికల్ థియరీ పరీక్షల కారణంగా ఈ బ్యూటీ కాంటెస్ట్‌కి సంబంధించిన అనేక భాగాల్లో పాల్గొనలేకపోయింది. అలాగే అదే టైమ్‌లో ఆమె మలేరియా జ్వరంతో ఇబ్బంది పడినట్లుగా చెప్పుకొచ్చింది. అయినా సరే, అన్నింటినీ అధిగమించి ఫైనల్‌లో పాల్గొనాలనే ప్రయత్నం చేస్తుండగా.. తను చదువుతున్న వైద్య విద్యకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీ, ఈ బ్యూటీ కాంటెస్ట్‌కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే తేదీ.. ఒకే రోజు రావడంతో.. ఫైనల్‌గా బ్యూటీ రేసు నుండి ఆమె వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా వెల్లడించింది. ఇంత వరకు తనకు మద్దతుగా నిలిచిన మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, తన తోటి ఫైనలిస్ట్‌లకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ పోటీలో ముందుకు వెళ్లలేకపోయినందుకు క్షమించమని కోరింది. వచ్చే సంవత్సరం తప్పకుండా మళ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఆశిస్తున్నట్లుగా చెప్పింది. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని, జూలై 3న గుంటూరులో జరిగే ప్రాక్టికల్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా ఆమె ప్రకటించింది.



Updated Date - 2022-06-30T01:13:13+05:30 IST