కోలీవుడ్‌లో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్ళు

ABN , First Publish Date - 2022-01-13T02:31:07+05:30 IST

టాలీవుడ్‌ సినీజంట జీవితా రాజశేఖర్‌ల కుమార్తెలు కోలీవుడ్‌లో అడుగు పెట్టారు. శివానీ, శివాత్మిక ఇద్దరూ కొన్ని రోజుల వ్యవధిలోనే తమిళ వెండితెరకు పరిచయమయ్యారు. నిజానికి వీరు పలు తెలుగు సినిమాల్లో నటించారు. కానీ కోలీవుడ్‌కు మాత్రం

కోలీవుడ్‌లో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్ళు

టాలీవుడ్‌ సినీజంట జీవితా రాజశేఖర్‌ల కుమార్తెలు కోలీవుడ్‌లో అడుగు పెట్టారు. శివానీ, శివాత్మిక ఇద్దరూ కొన్ని రోజుల వ్యవధిలోనే తమిళ వెండితెరకు పరిచయమయ్యారు. నిజానికి వీరు పలు తెలుగు సినిమాల్లో నటించారు. కానీ కోలీవుడ్‌కు మాత్రం పరిచయం కావడం ఇదే తొలిసారి. డిసెంబరు 31న రిలీజైన ‘ఆనందం విలైయాడుం వీడు’ చిత్రంలో శివాత్మిక పరిచయమవగా, ఈ నెల 7వ తేదీన విడుదలైన ‘అన్బరివు’ చిత్రం ద్వారా శివానీ అడుగుపెట్టింది. గతంలో వెండితెరకు లలిత, రాగిణి, పద్మినిలు.. 1980 దశకంలో అంబికా, రాధ.. ఆ తర్వాత రాధ కుమార్తెలు కార్తిక, తులసి పదేళ్ళ క్రితం ఇదే విధంగా వెండితెరకు పరిచయమయ్యారు. 

Updated Date - 2022-01-13T02:31:07+05:30 IST