Shalini Pandey: లైగర్‌.. లవ్‌ యూ!

ABN , First Publish Date - 2022-08-26T05:22:08+05:30 IST

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్‌ షాలినీ పాండే.. ఆ చిత్ర హీరో విజయ్‌ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం విడుదలై గురువారానికి (ఆగస్టు 25) ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె! తన జీవితానికి ఈ రోజు చాలా కీలకమని చెప్పారు షాలిని. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ చేశారు.

Shalini Pandey: లైగర్‌.. లవ్‌ యూ!

‘అర్జున్‌రెడ్డి(rjun reddy)’ హీరోయిన్‌ షాలినీ పాండే(Shalini pandey).. ఆ చిత్ర హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda)కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం విడుదలై గురువారానికి (ఆగస్టు 25) ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె! తన జీవితానికి ఈ రోజు చాలా కీలకమని చెప్పారు షాలిని. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ చేశారు. (Arjun redy completes 5 years)


‘‘ఆగస్ట్‌ 25వ తేదీకి నా జీవితంలో ఇంపార్టెన్స్‌ ఉంది. ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను నటిగా వెండితెరకు పరిచయమైన ‘అర్జన్‌రెడ్డి’ చిత్రం విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే సక్సెస్‌ ఇచ్చింది. ఆ చిత్రంలో ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినే. ‘అర్జున్‌ రెడ్డి’కి రుణపడి ఉంటా. మొదటి చిత్రంలో నటిగా ఎలా చేస్తానో అని భయపడ్డా. నాలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపి.. చిత్రీకరణ సరదాగా జరిగేలా చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు, నా కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు కృతజ్ఞతలు. ‘లైగర్‌’.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్‌ యూ’’ అని షాలినీ రాసుకొచ్చారు. 



సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ – షాలినీ పాండే జంటగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై 5 ఏళ్లు పూర్తయింది. 2017లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 50 కోట్ల వసూళ్లు రాబట్టి చిన్న చిత్రాల్లో సంచలనంగా నిలిచింది. (Shalini Pandey)






Updated Date - 2022-08-26T05:22:08+05:30 IST