షారూక్ ఖాన్ ఈజిఫ్ట్‌ అభిమాని చేసిన పనికి అవాక్కయిన నెటిజన్లు.. ఇంతకీ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-03T21:40:12+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఒక ప్రొఫెసర్‌కు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో

షారూక్ ఖాన్ ఈజిఫ్ట్‌ అభిమాని చేసిన పనికి అవాక్కయిన నెటిజన్లు.. ఇంతకీ ఏం చేశాడంటే..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఒక ప్రొఫెసర్‌కు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకోవడంతో ఆ విషయం మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళ్లితే..


ఈజిఫ్ట్‌లో నివసించే ఒక వ్యక్తి ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తుంటారు. అతడు కింగ్ ఖాన్‌కు వీరాభిమాని. అయితే..అశ్విని దేశ్‌పాండే అనే భారతీయ ప్రొఫెసర్ పని నిమిత్తం ఈజిఫ్ట్ వెళ్లాలనుకున్నారు. ట్రావెల్ ఏజెంట్‌కు టిక్కెట్టు బుక్ చేయమని చెప్పారు. కానీ, అనివార్య కారణాల వల్ల డబ్బులను పంపించలేకపోయారు. అయినప్పటికీ ఆ ట్రావెల్ ఏజెంట్ టిక్కెట్లను బుక్ చేశారు. ‘‘ మీరు షారూక్ దేశానికి చెందినవారు. మిమ్మల్ని నమ్ముతున్నాను. ఈజిఫ్ట్ వచ్చాక డబ్బులను చెల్లించండి ’’ అని ఆ ట్రావెల్ ఏజెంట్ అశ్విని దేశ్ పాండేకు చెప్పారు. దీంతో ఆమె సంతోషంలో మునిగిపోయారు. ఆ ఉదంతాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. షారూక్ అభిమానులు విపరీతంగా ఆ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు. దీంతో ఆ మెసేజ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-01-03T21:40:12+05:30 IST