SS Rajamouli దర్శకత్వం వహించిన ఈ మూవీలో Shahid Kapoor హీరోగా చేయాలి.. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా..?

ABN , First Publish Date - 2021-11-21T00:28:50+05:30 IST

బాహుబలి సినిమాకు దర్శకత్వం వహించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ ఎస్ ఎస్. రాజమౌళి. ఈ చిత్రం అనంతరం

SS Rajamouli దర్శకత్వం వహించిన ఈ మూవీలో Shahid Kapoor  హీరోగా చేయాలి.. ఆ  సినిమా ఏంటో మీకు తెలుసా..?

బాహుబలి సినిమాకు దర్శకత్వం వహించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ ఎస్ ఎస్. రాజమౌళి. ఈ చిత్రం అనంతరం భారత్ అంతటా ఆయన పేరు మారు మోగింది. ఇప్పటి వరకు ఆయన పరాజయం ఎరుగని దర్శకుడిగా నిలిచారు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన మగధీర సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. 2009లో విడుదలైన  ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయాలనుకున్నారు. ఒక స్టార్ నటుడిని కూడా సంప్రదించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు.     


బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌ను మగధీర హిందీ రీమేక్ కోసం సంప్రదించారు. హైదర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వదంతులపై  బాలీవుడ్ హీరో స్పందించాడు. తను ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్టు చెప్పాడు.  సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి సాజిద్ నడియడ్ వాలా, మధు మంతెన వంటి బడా నిర్మాతలు ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి.


‘‘ మగధీర సినిమాను నేను చూశాను. ఆ సినిమాలో నటించాలని కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఆ చిత్రంలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తల  గురించి నాకు తెలుసు. కానీ, ఇటువంటి వార్తలపై నేను స్పందించలేను ’’ అని షాహిద్ కపూర్ చెప్పాడు. కొన్ని రోజుల అనంతరం ఏమైందో తెలియదు. కానీ, ఆ చిత్రాన్ని చేయట్లేదని అతడు వెల్లడించాడు. ‘‘ నేను మగధీర రీమేక్‌లో నటించట్లేదు. రంగూన్ అనంతరం ఎవరూ కూడా నాతో సినిమాలు చేయడానికి ముందుకు రావట్లేదు ’’ అని ఉడ్తా పంజాబ్ ప్రమోషన్లలో భాగంగా అతడు స్పష్టం చేశాడు. 


షాహిద్ కపూర్ ప్రస్తుతం  జెర్సీ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.  

Updated Date - 2021-11-21T00:28:50+05:30 IST