ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న Kiara Advani.. డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన యంగ్ హీరో.. ప్రీతి అంటూ..

ABN , First Publish Date - 2022-06-14T22:20:40+05:30 IST

‘ఫగ్లీ’తో జూన్ 13, 2014లో బాలీవుడ్‌‌కి పరిచయమైన నటి కియారా అడ్వాణీ. రెండేళ్ల తర్వాత దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో..

ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న Kiara Advani.. డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన యంగ్ హీరో.. ప్రీతి అంటూ..

‘ఫగ్లీ’తో జూన్ 13, 2014లో బాలీవుడ్‌‌కి పరిచయమైన నటి కియారా అడ్వాణీ. 2016లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చేసిన ‘ఎంఎస్ ధోని’తో సూపర్ హిట్ కొట్టింది. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సాధించింది. 2014లో పరిచయమైన ఈ బ్యూటీ జూన్ 13, 2022 నాటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో తన సంతోషాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.


ఈ సందర్భంగా ఓ వీడియోని కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో.. యువ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటిస్తున్న తాజాగా చిత్రం ‘జుగ్ జుగ్ జియో’. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఈ చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జూన్ 13న కియారాకి ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసింది ఈ మూవీ టీం. అంతేకాకుండా.. ఓ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ విషయాన్ని చెబుతూ సంబరాలు చేశారు.


ఈ వీడియోని షేర్ చేసిన కియారా.. ‘జూన్ 13! నేను ఈ చిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాను. కెరీర్ ఇంద్రధనస్సుల సాగుతోంది. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మూవీటీం నా ఫ్యాన్‌ క్లబ్‌లతో వర్చువల్ ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేసి నన్ను ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన టీంతో ప్రారంభమైన రోజు వరుణ్‌ ధావన్‌తో ముగిసింది. ఆయన నేను ఎంతో అద్భుతమైన ఇండస్ట్రీలో ఎలా భాగమయ్యానో గుర్తు చేస్తూ.. ఈ సందర్భాన్ని ఓ వేడుకగా మార్చాడు. ఇండస్ట్రీలో నా వయస్సు 8 సంవత్సరాలే కావొచ్చు. కానీ.. నాకు జీవితానికి సరిపడ వినోదాన్ని పంచింది. ఇలాగే.. భవిష్యత్లులోనూ మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను!’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.




ఎంతోమంది నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ కియారాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ బ్యూటీ విషెస్ చెబుతున్నారు. వరుణ్ ధావన్ కామెంట్స్‌లో మూడు స్టార్లను పోస్ట్ చేశాడు. షాహిద్ కపూర్ అయితే ఆయన సినిమా ‘కబీర్ సింగ్’లో కియారా చేసిన ప్రీతి క్యారెక్టర్‌ని గుర్తు చేస్తూ.. ‘కంగ్రాట్స్ ప్రీతి.. ఇలాంటివి ఇంకా సాధించాలి’ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కియారా నటించిన ‘భూల్ భులయ్యా 2’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘జుగ్ జుగ్ జీయో’ జూన్ 24న  విడుదల కానుంది.

Updated Date - 2022-06-14T22:20:40+05:30 IST