Shah Rukh Khan, Salman Khan కలసి సినిమా చేయబోతున్నారా..?
ABN , First Publish Date - 2022-07-05T20:34:09+05:30 IST
బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan)కలసి సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఓ థ్రిలర్ చిత్రం
బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan)కలసి సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఓ థ్రిలర్ చిత్రం కోసం వీరిద్దరు కలసి పనిచేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని యశ్రాజ్ ప్రొడక్షన్స్ అధినేత ఆదిత్య చోప్రా (Aditya Chopra)భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. షారూఖ్, సల్మాన్ చివరగా ‘జీరో’ లో కనిపించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు.
కింగ్ ఖాన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 30ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అతడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్ నిర్వహించాడు. ‘‘సల్మాన్తో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అని అతడు చెప్పాడు. స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో నటించడంపై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కొంత కాలం క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘నిర్మాత మాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ చెల్లించగలిగితే సినిమా చేసేందుకు మేం సిద్ధం. కానీ, ముగ్గురు కలసి పనిచేయడం అనేది కష్టతరమైన విషయం. మా ముగ్గురి పని విధానం కొత్తగా ఉంటుంది’’ అని షారూఖ్ తెలిపాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్-3’ (Tiger 3) ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అదే విధంగా కింగ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ లోను సల్లూ భాయ్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. యశ్రాజ్ స్పై యూనివర్స్లో ఈ ప్రాజెక్టులు భాగమని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అతిథి పాత్రలు చేయడం, పూర్తి స్థాయి సినిమాలు చేయడం వేర్వేరు. కానీ, షారూఖ్, సల్మాన్ కలసి ఓ చిత్రం చేస్తే అది ప్రేక్షకులకు కనుల పండగే అని చెప్పాలి.