Seetaramam : లెఫ్టినెంట్ రామ్ ప్రేమకథ!
ABN , First Publish Date - 2022-06-26T02:18:18+05:30 IST
దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్థ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మృణాళిని ఠాకూర్ కథానాయిక కాగా, రష్మిక మందన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ చిత్రం టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
దుల్కర్ సల్మాన్ (Dulquer salmaan) హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’ (Seetha ramam). హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వంలో యుద్థ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మృణాళిని ఠాకూర్ కథానాయిక కాగా, రష్మిక మందన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ చిత్రం టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘లెఫ్టినెంట్ రామ్. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అన్న మాటలతో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ వాయిస్ను ఫాలో అవుతూ సాగిన విజువల్స్, ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో ఏకకాలంలో రూపొందతుఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Seetharamam on 5 august)
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘వైజయంతి మూవీస్పై నాకు అపారమైన నమ్మకం ఉంది. హను కథ చెప్పినప్పుడు ఎపిక్ లవ్ స్టొరీ అనిపించింది. నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు. కానీ సినిమా స్కోర్ చేేస్త నేను హ్యాపీ. ఈ చిత్రం నాకు మంచి జ్ఞాపకం లాంటిది. అద్భుతమైన లొకేషన్స్లో షూట్ చేశాం. సినిమా విజువల్ వండర్గా ఉండబోతుంది. నేను 35 సినిమాలు చేశా. కానీ దర్శకుడు హను నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు
‘‘ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వందల మంది రెండేళ్లగా కష్టపడుతున్నాం. ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన దుల్కర్, నిర్మాత స్వప్న గారికి థాంక్స్’’ అని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు.
‘‘మహానటిలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించారు. ఆయనకి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాం. ఆయనకు నచ్చి ఓకే అన్నారు. ఆయన మాపై ఉంచిన నమ్మకంతో మరింత బాధ్యత పెరిగింది. తనకు మరో సూపర్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని స్వప్నాదత్ అన్నారు. (Seetharamam on 5 august)