నయనతార షాకింగ్ నిర్ణయం?

ABN , First Publish Date - 2022-03-23T19:28:43+05:30 IST

కొంతకాలంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు వీరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నయన్ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఎంగేజ్ మెంట్ జరిగిందని త్వరలోనే పెళ్ళిచేసుకోబోతున్నట్టు ప్రకటించింది. విఘ్నేశ్ శివన్ నుంచి కూడా దానికి క్లారిటీ వచ్చింది. పెళ్లి ఎప్పుడో అన్నది టైమ్ రాగానే చెబుతామని .. ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరూ చెన్నైలోని ఒక టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నయనతార షాకింగ్ నిర్ణయం?

కొంతకాలంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు వీరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నయన్ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఎంగేజ్ మెంట్ జరిగిందని త్వరలోనే పెళ్ళిచేసుకోబోతున్నట్టు ప్రకటించింది. విఘ్నేశ్ శివన్ నుంచి కూడా దానికి క్లారిటీ వచ్చింది. పెళ్లి ఎప్పుడో అన్నది టైమ్ రాగానే చెబుతామని .. ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరూ చెన్నైలోని ఒక టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్ నయన్ నుదుటన తిలకం దిద్దడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్త స్ప్రెడ్ అయింది. అయితే ఈ జంట నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కనీసం ఈ వార్తల్ని వారు ఖండించలేదు. 


ఇదిలా ఉంటే తాజాగా నయనతారకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సరోగసీ ద్వారా ఒక బిడ్డను కనబోతోందని వార్తలొస్తున్నాయి. ఆ సందర్బంగానే చెన్నైలో ప్రత్యేక పూజలు నిర్వహించారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. అయితే ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి చేసుకుంటారు కాబట్టి.. వారికి ఆ అవసరం లేదని కొందరంటున్నారు. ఏది ఏమైనా సరోగసీ ద్వారా నయన్ సంతానాన్ని కనబోతోందనే వార్త మాత్రం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై ఆ ప్రేమికులిద్దరూ ఏమంటారో చూడాలి. 

Updated Date - 2022-03-23T19:28:43+05:30 IST