Sarkaruvaari Paata : ఓటీటీలోకి వచ్చేస్తోంది... !

ABN , First Publish Date - 2022-06-15T19:26:17+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu), దర్శకుడు పరశురామ్ (Parasuram) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata). బ్యాంక్‌లోన్ కుంభకోణం నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందింది.

Sarkaruvaari Paata : ఓటీటీలోకి వచ్చేస్తోంది... !

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu), దర్శకుడు పరశురామ్ (Parasuram) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata). బ్యాంక్‌లోన్ కుంభకోణం నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చెప్పుకోదగ్గ వసూళ్ళనే నమోదు చేసింది. కీర్తి సురేశ్ (Keerthisuresh) కథానాయికగా నటించగా.. సముద్రఖని (Samuthirakhani) విలన్‌గా మెప్పించారు. వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, నదియా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రేమ్ (Amazon Prime) లో విడుదలైంది. అయితే పే ఫర్ వ్యూ (Pay for View) పద్ధతిలో మాత్రమే చూసే వీలుకల్పించారు. సాధారణ చందాదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. 


అయితే ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ (Digital premier) కు సిద్ధమవుతోంది ‘సర్కారువారి పాట’ చిత్రం. రెగ్యులర్ చందాదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఆ మేరకు అఫీషియల్‌గా ప్రకటించారు. మొబైల్ ఎడిషన్‌లో కూడా ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది.  థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఇంకెంతటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి. 



Updated Date - 2022-06-15T19:26:17+05:30 IST