'ఆచార్య' థియేటర్స్‌లో మహేశ్ 'పాట'..?

ABN , First Publish Date - 2022-04-26T14:17:19+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్ సమయం దగ్గరపడుతులన్నా ఈ మూవీకి సంబంధించిన వరుస అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో

'ఆచార్య' థియేటర్స్‌లో మహేశ్ 'పాట'..?

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్ సమయం దగ్గరపడుతులన్నా ఈ మూవీకి సంబంధించిన వరుస అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత అసహనానికి గురౌవుతున్నారు. ఈ పాటికే వచ్చేస్తుందనుకున్న థియేట్రికల్ ట్రైలర్ కూడా రాలేదు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ నెల 29న 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. 


ఆ రోజు మెగా మల్టీస్టారర్ 'ఆచార్య' భారీ స్థాయిలో థియేటర్స్‌లో వచ్చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆచార్య రిలీజ్ రోజు 'సర్కారు వారి పాట' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. త్వరలో దీనికి సంబంధించిన అప్‌డేట్ రానుందని తెలుస్తోంది. అదే జరిగితే అటు మెగా ఫ్యాన్స్, ఇటు మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు. 

Updated Date - 2022-04-26T14:17:19+05:30 IST