‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి.. మాస్ పోస్టర్ అదిరింది

ABN , First Publish Date - 2022-04-23T01:38:06+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ తాజాగా ఓ మాస్ పోస్టర్‌ని

‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి.. మాస్ పోస్టర్ అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’.  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ తాజాగా ఓ మాస్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఒక పాట మినహా షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఆర్‌‌ఎఫ్‌‌సిలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఆ పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.


మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడో సింగిలైన టైటిల్ సాంగ్‌ను శనివారం ఉదయం 11గంటల 07 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌‌లో మహేష్ బాబు పవర్ ఫుల్‌గా కనిపించి అంచనాలు పెంచారు. కాగా, మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



Updated Date - 2022-04-23T01:38:06+05:30 IST