Sarkaru Vaari Paata: మేకర్స్ కొత్త ప్లాన్..ఇది రిపీటెడ్ ఆడియన్స్ కోసమే
ABN , First Publish Date - 2022-05-27T14:38:21+05:30 IST
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా బృందం రిపీటెడ్ ఆడియన్స్ కోసం కొత్త ప్లాన్ వేసింది. కొత్తగా ఈ మూవీలో ఓ సర్ప్రైజింగ్ ట్రీట్ను యాడ్ చేయనున్నారట. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా బృందం రిపీటెడ్ ఆడియన్స్ కోసం కొత్త ప్లాన్ వేసింది. కొత్తగా ఈ మూవీలో ఓ సర్ప్రైజింగ్ ట్రీట్ను యాడ్ చేయనున్నారట. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా కీర్తి సురేశ్ (Keerthi Suresh) హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 12న థియేటర్స్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మహేశ్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమాలో మరో కొత్త పాటను యాడ్ చేయబోతున్నారట. ఆల్బంలో ఉన్న మురారి బావ పాట సినిమాలో లేదు. మంచి విజువల్ ట్రీట్లా ఉండే ఈ సాంగ్ను సినిమా రిలీజ్ సమయంలో యాడ్ చేయలేదని చిత్ర దర్శకుడు పరశురామ్ (Parasuram) చెప్పారు. ఇప్పుడు అదే పాటను సినిమాలో యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అది కూడా మే 28 నుంచేనట. ఎఫ్ 3 రిలీజ్ అయిన నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమాకు కలెక్షన్ బాగా డ్రాపవుతాయని ప్రత్యేకంగా చెప్పనసరం లేదు.
అందుకే, ఇప్పుడు సర్కారు వారి పాటలో మురారి బావ పాటను యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. చూడాలి మరి దీనికి సంబధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో. కాగా, మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మించాయి.