ఆ రెండు భాషల్లోనూ 'సర్కారు వారి పాట'..!

ABN , First Publish Date - 2022-03-09T15:27:53+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆ రెండు భాషల్లోనూ 'సర్కారు వారి పాట'..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రాబోతోంది. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సర్కారు వారి పాట తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషలలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ సినిమాలు హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సర్కారు వారి పాట కూడా హిందీలో వస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై దర్శక, నిర్మాతలు ఎప్పుడు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 

Updated Date - 2022-03-09T15:27:53+05:30 IST