Sarkaaruvaari paata : ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-05-03T15:41:21+05:30 IST

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పరశురామ్ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. బ్యాకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని విలన్‌గా నటిస్తున్నారు. మే 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా సాగిస్తున్నారు మేకర్స్.

Sarkaaruvaari paata : ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం అప్పుడేనా?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పరశురామ్ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. బ్యాకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని విలన్‌గా నటిస్తున్నారు. మే 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా సాగిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా నిన్న (సోమవారం) ఈ సినిమా థియేట్రిక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‌ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చాలా  గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన సన్నాహాల్ని ఇప్పటి నుంచి చేస్తున్నారు. 


తాజా సమాచారం ప్రకారం ఈ నెల 7న యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ‘సర్కారువారి పాట’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. మరి ఈ సినిమాకి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేస్తారు? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. లోన్ రికవరీ ఏజెంట్ గా మహేశ్‌బాబు నటిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, బియమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, ‘గీత గోవిందం’ సూపర్ హిట్ తర్వాత పరశురామ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘సర్కారువారి పాట’ చిత్రంపై మరింత హైపు క్రియేట్ అయింది. మరి ఈ సినిమా మహేశ్‌కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-03T15:41:21+05:30 IST