Vijay: లోకేష్ సినిమాలో విలన్గా ‘అధీరా’
ABN , First Publish Date - 2022-09-13T21:29:23+05:30 IST
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటుంటాడు. విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటుంటాడు. విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ (Varasudu) లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్స్లోకి రానుంది. ఈ చిత్రం పూర్తికాగానే లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్గా దళపతి 67 అని పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియలో షికార్లు కొడుతుంది.
లోకేశ్ కనకరాజ్ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్ పాత్రను షోషించనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అనేక ప్రతినాయక పాత్రలకు ఆస్కారముందట. ఒక్క పాత్రకు సంజు బాబాను ఎంపిక చేశారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. సంజయ్ విలన్ రోల్ చేయడానికి భారీగానే డిమాండ్ చేశాడట. దాదాపుగా రూ.10కోట్ల రెమ్యూనరేషన్ను తీసుకోబోతున్నాడని వదంతులు హల్చల్ చేస్తున్నాయి. సంజయ్ దత్ ‘కెజియఫ్-2’ లో అధీరా పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనకరాజ్ చివరగా ‘విక్రమ్’ కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అందువల్ల విజయ్తో తీసే ప్రాజెక్టును కూడా అదే స్థాయిలో తెరకెక్కించించాలని లోకేశ్ భావిస్తున్నాడు. ఈ చిత్రం గ్యాంగ్స్టర్ నేపథ్యలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ ఏడాది చివరలో షూటింగ్ను ప్రారంభించే అవకాశం ఉంది. దీపావళి కానుకగా మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు.