అబద్ధాలనే ఈ సమాజం నమ్ముతోంది: సమంత
ABN , First Publish Date - 2022-05-07T00:58:37+05:30 IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉన్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరినో ఉద్దేశించి సామ్ ఈ పోస్ట్ చేసుంటారని భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘నిజాలు ఎప్పుడూ అరుదుగా బయటకు వస్తాయి. కానీ అబద్థాలే వేగంగా ప్రచారంలో ఉంటాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉన్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరినో ఉద్దేశించి సామ్ ఈ పోస్ట్ చేసుంటారని భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘నిజాలు ఎప్పుడూ అరుదుగా బయటకు వస్తాయి. కానీ అబద్ధాలే వేగంగా ప్రచారంలో ఉంటాయి. అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది’’ అని సమంత ఇన్స్టాగ్రామ్ స్టాటస్లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
నాగచైతన్యతో విడాకులు తర్వాత సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టవ్గా మారారు. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయకుండా కొటేషన్స్ రూపంలో పలు పోస్ట్లు చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.