Vikram Director Lokesh Kanagaraj తో Salman Khan కొత్త సినిమా.. బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం..!
ABN , First Publish Date - 2022-07-19T20:20:01+05:30 IST
కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రంతో తెలుగులోనూ పాపులారిటీ సాధించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్..
కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రంతో తెలుగులోనూ పాపులారిటీ సాధించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్తో చేసిన చిత్రం ‘విక్రమ్ (Vikram)’. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్కి దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ తరుణంలో ఈ యువ దర్శకుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబో సెట్ అవ్వనున్నట్లు ఓ క్రేజీ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
బాలీవుడ్లోని సూపర్స్టార్స్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ స్టార్ త్వరలో సౌత్ డైరెక్టర్లతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు గతకొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. అయితే అందులో ఏ వార్త కూడా నిజం కాలేదు. ఈ స్టార్ హీరో, లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని మైత్రి ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఇటీవలే హైదరాబాద్కి వచ్చాడు. ఆ సమయంలోనే మైత్రి ప్రొడక్షన్స్ ఈ ఇద్దరూ లెజెండ్స్ మధ్య ఓ మీటింగ్ ఆరెంజ్ చేసిందట. ఇప్పటి వరకూ ఇద్దరికీ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ కాంబోలో మూవీ పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. కాగా.. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే.. ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ వెంకటేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లోకేశ్ సైతం దళపతి విజయ్తో ఓ సినిమా చేస్తున్నాడు. అనంతరం లోకేశ్ మల్టీవర్స్లో భాగంగా వరుసగా కార్తీ, కమల్ హాసన్, సూర్య(Suriya)తో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.