Salman Khan: విశాఖపట్నంలో నేవీ అధికారులతో రోజంతా గడిపిన బాలీవుడ్ హీరో.. సూపర్ అంటూ..

ABN , First Publish Date - 2022-08-11T18:20:51+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడి దేశభక్తి కూడా ఎక్కువే అనే విషయం తెలిసిందే...

Salman Khan: విశాఖపట్నంలో నేవీ అధికారులతో రోజంతా గడిపిన బాలీవుడ్ హీరో.. సూపర్ అంటూ..

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడి దేశభక్తి కూడా ఎక్కువే అనే విషయం తెలిసిందే. అందుకే కుదిరినప్పుడు అది బయటపెడుతున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాజాగా సల్లు‌భాయ్ విశాఖపట్నంలోని నేవీ అధికారులతో ఒకరోజు గడిపాడు. అందులో భాగంగా.. భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఒకటైన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం(INS Visakhapatnam)లో గడిపాడు.


‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్ విశాఖపట్నంలోని నావికులతో గడపడానికి ఒక రోజుని కేటాయించారు. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ అక్కడ చూసిన నావికులు చాలా ఆనందపడ్డారు. అందులో భాగంగా అధికారులను జీవితం, శిక్షణ, ప్రియమైనవారికి దూరం ఉండడం వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నాడు. అలాగే.. ఓడలో వంట చేయడం, పుష్ అప్ ఛాలెంజ్‌లు చేశాడు. పలువురికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అలాగే భారత జెండాను ఎగురవేశాడు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ ‘సల్మాన్ నిజమైన దేశభక్తుడు’, ‘సూపర్ సల్లు భాయ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



Updated Date - 2022-08-11T18:20:51+05:30 IST