RRR ఈవెంట్ వేదికగా రాజమౌళి సమక్షంలో Salman Khan బిగ్ అనౌన్స్మెంట్..!
ABN , First Publish Date - 2021-12-20T21:05:28+05:30 IST
రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 19న ముంబైలో ఘనంగా జరిగింది
రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 19న ముంబైలో ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్కు కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరించారు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫంక్షన్లో తన అభిమానులకు సల్మాన్ ఖాన్ తీపికబురును అందించారు. ఆ ఈవెంట్ వేదికగా రాజమౌళి సమక్షంలో బిగ్ అనౌన్స్మెంట్ చేశారు.
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘‘ బజరంగీ భాయిజాన్ ’’. సల్లూ భాయ్ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బజరంగీ భాయిజాన్కు సీక్వెల్ను ప్రకటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బజరంగీకి కథను అందించారు. తాజాగా సీక్వెల్కు కూడా ఆయనే కథను అందించబోతున్నారు. ఇప్పటికే సీక్వెల్కు సంబంధించిన స్ర్కిఫ్ట్ వర్క్ను విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారని తెలుస్తోంది.
తన కెరీర్లో బెస్ట్ ఫిలిం అయిన బజరంగీ భాయిజాన్కు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారని సల్మాన్ తెలిపారు. సీక్వెల్కు కూడా కథ సిద్ధమైందని బాలీవుడ్ కండలవీరుడు ప్రకటించారు. బజరంగీకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కరీనాకపూర్, నవాజుద్దీన్ సిద్దీఖీ కీలక పాత్రల్లో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్లో టాప్ 5 గ్రాసర్స్గా నిలిచింది. ఆ చిత్రం 2015, జులై 17న విడుదలైంది. కానీ, బజరంగీకి దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్ మాత్రం సీక్వెల్కు కథ సిద్థం కాలేదని చెప్పడం కొసమెరుపు. 83 మూవీ ప్రమోషన్లల్లో కబీర్ పాల్గొంటున్నారు. ఆ ప్రమోషన్లల్లో భాగంగా సీక్వెల్కు కథ సిద్ధం కాలేదని ఆయన తెలిపారు.