Sakshi Chaudhary: ‘చాలా తపనతో ఈ సినిమా చేశాం’

ABN , First Publish Date - 2022-11-30T18:45:51+05:30 IST

‘నేనెవరు’ (Nenevaru) చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని చిత్ర హీరోహీరోయిన్లు కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి (Sakshi Chaudhary) తెలిపారు..

Sakshi Chaudhary: ‘చాలా తపనతో ఈ సినిమా చేశాం’

‘నేనెవరు’ (Nenevaru) చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని చిత్ర హీరోహీరోయిన్లు కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి (Sakshi Chaudhary) తెలిపారు. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు ఎంత తపన పడ్డారో తాము ప్రత్యక్షంగా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమ్‌ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని వారు తెలిపారు. అలాగే.. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటింగ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని కోలా బాలకృష్ణ అన్నారు.


ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ, ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు ‘నేనెవరు’ మంచి పేరు తెస్తుందని సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలకు, టీజర్, ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం... ఈ చిత్రం సాధించబోయే ఘన విజయానికి సంకేతంగా భావిస్తున్నామని ఆమె అన్నారు.


నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. లవ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.





Updated Date - 2022-11-30T18:45:51+05:30 IST