Sakshi Agarwal: వారి సంతోషం కోసమే అలాంటి ఫొటోలు షేర్ చేస్తున్నా
ABN , First Publish Date - 2022-10-27T16:05:11+05:30 IST
ఆర్య, నయన తార సినిమా ‘రాజా రాణి’ సినిమాలో చిన్న పాత్ర చేసి సినీ ఇండిస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal)..
ఆర్య, నయన తార సినిమా ‘రాజా రాణి’ సినిమాలో చిన్న పాత్ర చేసి సినీ ఇండిస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal). అనంతరం కన్నడ సినిమా ‘సాఫ్ట్వేర్ గండ’లో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించి మెప్పించింది. అనంతరం కోలీవుడ్ (Kollywood)కి షిఫ్ట్ అయ్యి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే.. ఈ బ్యూటీ సోషల్ మీడియా (Social Media)లో కూడా చాలా యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడూ ఆ ఖాతాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంటుంది. ఈ తరుణంలోనే సినిమా అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో సాక్షి సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు విమర్శలు చేశారు. ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాక్షి స్పందించింది.
తాను సినిమా అవకాశాలు పొందేందుకు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని అందులో హీరోయిన్ సాక్షి అగర్వాల్ తోసిపుచ్చింది.. కేవలం సోషల్ మీడియా ఖాతాల్లో తనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్ల కోసమే ఆ ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్టు వివరించింది.
ఇదే విషయంపై సాక్షి మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పుడు ‘బహీరా’, ‘నాన్ కడవుల్ ఇల్లై’, ‘గెస్ట్ ఛాప్టర్-2’ అనే హార్రర్ మూవీలో నటిస్తున్నాను. ఇవే కాకుండా నూతన దర్శకుడు విక్కీ, శక్తి దర్శకత్వంలో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాను. మరో రెండు తమిళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. కాబట్టి సినిమా ఛాన్సుల కోసం సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేయడం లేదు. 2 మిలియన్ల మంది నెటిజన్లు నా సోషల్ మీడియా ఖాతాను ఫాలో అవుతున్నారు. వారిని సంతోష పెట్టేందుకు గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నాను’ అని వెల్లడించింది.