సుప్రీమ్ హీరో వదిలిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ మెలోడి సాంగ్
ABN , First Publish Date - 2022-04-16T01:54:02+05:30 IST
సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గుడ్ ఫ్రైడే సందర్భంగా ‘నిను చూశాక..’ అనే పాటను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ.. చిత్రయూనిట్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ (జాను ఫేమ్) లపై ఈ మెలోడీ సాంగ్ను చిత్రీకరించారు.
కమ్రాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటని రాకేందు మౌళి రచించగా.. సింగర్ జునైద్ కుమార్ ఆలపించారు. వేర్వేరు మనస్తత్వాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే సంఘర్షణ, ప్రేమ వంటి ఎలిమెంట్స్ను హైలెట్స్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. శరణ్య పొట్ల ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా సుష్మిత కొణిదెల ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్గానూ వర్క్ చేశారు. ప్రస్తుతం విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.