నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది: సాయి పల్లవి

ABN , First Publish Date - 2021-12-24T01:25:44+05:30 IST

నేను నటించిన ఏ సినిమా రిలీజ్‌ అవుతున్నా.. ముందు చాలా భయంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో మాత్రం ఫస్ట్ డే నుండి నానిగారి నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలు

నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది: సాయి పల్లవి

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. 


ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన ఏ సినిమా రిలీజ్‌ అవుతున్నా.. ముందు చాలా భయంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో మాత్రం ఫస్ట్ డే నుండి నానిగారి నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. దయచేసి అందరూ థియేటర్లలోనే చూడండి. నాకు ఎలాంటి రోల్ చేస్తే సంతోషమనిపిస్తుందో అదే చేస్తాను. ఆ పాత్రను నేను చేయగలనా? లేదా? అని ఆలోచిస్తాను. నేను సినిమాను చూస్తే నాకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచి పాత్రలను ఎంచుకుంటాను. ఈ చిత్రంలో నాకే నచ్చిన పాత్రను చేశాను. నేను డ్యాన్స్ చేయగలను అని డ్యాన్స్ మూమెంట్స్ పెట్టమని నేను అడగను. పాత్రకు ఎంత కావాలో అంతే చేస్తాం. దేవదాసీలు అంటే ఇలా ఉంటారా? అని అనుకున్నాను. కానీ దర్శకుడు మాత్రం ఈ పాత్రను చక్కగా డిజైన్ చేశారు. ఈ పాత్రను చేయడంతో నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది. మేం కామ్రేడ్‌లాంటి వాళ్లం. ఇద్దరికీ నటన అంటే పిచ్చి. మేం ఎప్పుడూ దర్శకులను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటాం. నేను ఏడిస్తే జనాలు సినిమాలు చూడరు. నవ్వితేనే చూస్తారు అని అనుకోను. నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తాను’’ అని అన్నారు.

Updated Date - 2021-12-24T01:25:44+05:30 IST