Pooja Kannan: జీ 5 ఓటీటీలో వచ్చేసిన సాయి పల్లవి చెల్లి సినిమా..

ABN , First Publish Date - 2021-12-04T18:31:11+05:30 IST

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇప్పుడు ఆమె చెల్లి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'చితిరై సెవ్వానం'

Pooja Kannan: జీ 5 ఓటీటీలో వచ్చేసిన సాయి పల్లవి చెల్లి సినిమా..

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇప్పుడు ఆమె చెల్లి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'చితిరై సెవ్వానం' ఇప్పుడు జీ 5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అచ్చం సాయి పల్లవిలాగే కనిపిస్తున్న పూజా కన్నన్ తన నటనతో బాగానే ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్స్ శివ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి ఎక్కువశాతం మేకప్ లేకుండానే తెరపై కనిపించేందుకు ఇష్టపడుతుంది. ఇప్పుడు తన చెల్లి పూజా కూడా అక్కనే ఫాలో అవుతుందని తాజా చిత్రం చూస్తే అర్థమవుతుంది. పూజా కూడా నేచురల్ పర్ఫార్మర్ అనిపించుకునేందుకే ట్రై చేస్తుంది. డెబ్యూ సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ త్వరలో తెలుగు తెరకు పరిచయం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-12-04T18:31:11+05:30 IST