Sai pallavi: నాకు అది కంఫర్ట్ కాదు
ABN , First Publish Date - 2022-05-23T22:48:42+05:30 IST
కెరీర్ బిగినింగ్ నుంచి సంప్రదాయ పాత్రలతోనే ముందుకెళ్తుంది సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్కు ఆమె దూరం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఆమె ఓటు. తను గీసుకున్న గీతలోనే అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగారు. సాయిపల్లవిలో అద్భుతమైన డాన్సర్ కూడా ఉన్నారని ఇప్పటికే ఆమె నటించిన చిత్రాల్లో చూశాం.
కెరీర్ బిగినింగ్ నుంచి సంప్రదాయ పాత్రలతోనే ముందుకెళ్తుంది సాయి పల్లవి(Sai pallavi). గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్కు ఆమె దూరం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఆమె ఓటు. తను గీసుకున్న గీతలోనే అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగారు. సాయిపల్లవిలో అద్భుతమైన డాన్సర్ కూడా ఉన్నారని ఇప్పటికే ఆమె నటించిన చిత్రాల్లో చూశాం. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యారెక్టర్ల్ ఎంపిక, ప్రత్యేక గీతాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. ‘రంగస్థలం’(Rangastalam)లో ‘జిగేల్ రాణి’, ‘పుష్ప’(Pushpa)లో ‘ఊ అంటావా ఊఊ అంటావా’ తరహా ప్రత్యేక గీతాల్లో అవకాశం వస్తే నటిస్తారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి ససేమిరా నో అనేశారు.
‘‘అలాంటి పాటలు చేయడానికి నేను కంఫర్ట్గా ఉండను. ఆ తరహా అవకాశం వస్తే మాత్రం చేయను అని నిర్మొహమాటంగా చెప్పేస్తాను. మామూలుగా నేను చేసే పాత్రల్లో డ్రెస్ కంఫర్ట్గా లేకపోతే చాలా ఇబ్బందిగా ఫీలవుతా. ఐటెమ్ సాంగ్ అనేది సినిమాలో ఓ పర్పస్ కోసం పెడతారు. నాకు అది కంఫర్ట్ కాదు. ఇప్పటి వరకూ అయితే అలాంటి పాటలు చేయాలన్న ఆలోచన నాకు లేదు’’ అని చెప్పారు.
‘‘అలాగే మనిషికి కెరీర్ ఎంత అవసరమో.. లవ్ కూడా అంతే అవసరం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా లైఫ్ ఫుల్ఫిల్ కాదు’’ అని సాయి పల్లవి తెలిపారు.