Pushpa 2 లో సాయి పల్లవి..క్లారిటీ ఇదే..!

ABN , First Publish Date - 2022-09-10T19:30:49+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా పుష్ప 2. (Pushpa 2) తాజాగా ఈ మూవీపై వస్తున్న వార్తల గురించి మేకర్స్ స్పందించారు.

Pushpa 2 లో సాయి పల్లవి..క్లారిటీ ఇదే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా పుష్ప 2. (Pushpa 2) తాజాగా ఈ మూవీపై వస్తున్న వార్తల గురించి మేకర్స్ స్పందించారు. ఇందులో ఫిదా బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) నటించనుందా..? అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'పుష్ప: ది రైజ్'. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్' మొదలవబోతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.


అయితే, రెండవ భాగంలో సాయి పల్లవి కూడా నటించబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో చాలామంది ఇది నిజమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ స్పందించి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిపారేశారు. పుష్ప సీక్వెల్‌లో సాయి పల్లవి కూడా నటిస్తుందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. రష్మిక మందన్న తప్ప మరో హీరోయిన్ ఇందులో లేదు..అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ గాసిప్ రాయుళ్ళు క్రియేట్ చేసిన న్యూస్ అని అర్థమైంది. 


కాగా, పార్ట్ 1లో నటించిన సునీల్, అనసూయ, అజయ్ ఘోస్, ఫహద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లోనూ కంటిన్యూ కాబోతున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మించబోతున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.350 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు అదే బడ్జెట్‌తో పార్ట్ 2ని నిర్మించబోతుండటం ఆసక్తికరమైన విషయం. సుకుమార్ - అల్లు అర్జున్ కలిసి మొదటి భాగంతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. మరి ఈ సీక్వెల్ మూవీతో అంతకుమించి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. 

Updated Date - 2022-09-10T19:30:49+05:30 IST